ఏపీ రాజధాని అమరావతి విషయంలో వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ చేసిన ప్రకటన అందరిని గందరగోళంలోకి నెట్టి వేసింది.ఇప్పటి వరకు రాజధాని అంశం పై వైసిపి నాయకులు, మంత్రులు మాత్రమే స్పందిస్తున్నారు తప్ప జగన్ ఎక్కడా నోరు మెదపలేదు.
అయితే అకస్మాత్తుగా అసెంబ్లీలో జగన్ మాట్లాడుతూ ఏపీలో మూడు రాజధానులు రావచ్చు అంటూ రాజధాని కర్నూలు అమరావతి పేర్లను చెప్పారు.జగన్ ప్రకటన సామాన్యులకు ఎలా ఉన్నా టిడిపి నేతల్లో మాత్రం ఆందోళనను పెంచింది.
అమరావతి రాజధాని గా ఫిక్స్ అయిపోయిన టిడిపి నాయకులు చాలా మంది రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా ఆస్తులను కూడా పెట్టారు.అయితే జగన్ ప్రకటనతో వీరంతా నిరాశ నిస్పృహల్లోకి వెళ్లిపోయారు.
అయితే జగన్ ప్రకటన ఆషామాషీగా ఏమి చేయలేదు.దాని వెనుక జగన్ కు ఓ ప్లాన్ ఉంది.
సచివాలయాన్ని మళ్లీ విశాఖకు తరలిస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయనే విషయం జగన్ కూడా తెలుసు.ఐదేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చేందుకు చాలా మంది ఉద్యోగులు ఇష్టపడలేదు.అనేక రకాలుగా నచ్చజెప్పి ఒప్పించి తీసుకొచ్చారు.అంతే కాకుండా వారానికి వారికి రెండు సెలవు దినాలు కూడా ఇచ్చారు.దీంతో ఉద్యోగులు హైదరాబాద్ నుంచి వస్తూనే ఉన్నారు.చాలామంది తమ కుటుంబాలను హైదరాబాద్లోనే ఉంచి మీరు మాత్రం వారానికి ఒకసారి వెళ్లి వస్తున్నారు జగన్ ప్రకటన ఉద్యోగులు ఆందోళన పెరిగింది .
ప్రస్తుతానికి అమరావతి లో ఎటువంటి ఇబ్బంది లేకపోయినా, విశాఖ వెళ్లాలంటే చాలా ఇబ్బందులు వస్తాయని, మీరు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.ఇప్పటివరకు కు కు హైదరాబాద్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరి వెళ్లి సోమవారం మధ్యాహ్నానికి వచ్చే వారు.వీరి కోసం స్పెషల్ గా ట్రైన్ కూడా వేసారు.అయితే ఇప్పుడు అకస్మాత్తుగా హైదరాబాద్ నుంచి విశాఖకు అంటే చాలా మంది ఉద్యోగులు వెనుకడుగు వేస్తున్నారు.జగన్ ప్రకటన పై అసలు ఇప్పుడు వరకు ఉద్యోగ సంఘాల నాయకులు ఎవరూ కూడా స్పందించలేదు కానీ లోలోపల మాత్రం ఇదే విషయమై తీవ్రంగా చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది.అది కాకుండా సచివాలయాన్ని ఇప్పటికిప్పుడు భారీగానే ఖర్చు అవుతుంది.
ఏపీ ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా అది కాకుండా సచివాలయాన్ని ఇప్పటికిప్పుడు భారీగానే ఖర్చు అవుతుంది.ఏపీ ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఇది చాలా బాధాకరం అవుతుంది అయితే జగన్ ప్రకటన వెనుక వ్యూహాత్మక ఎత్తుగడ ఉందని కొంతమంది రాజకీయం ఇస్తున్నారు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో విజయం విజయం సాధించేందుకు మూడు ప్రాంతాల్లోనూ వైసీపీకి రాజకీయంగా తెచ్చేందుకు జగన్ ఈ ప్రకటన ఎంత అకస్మాత్తుగా చేశారని వాస్తవానికి రాజధాని మార్చే ఆలోచన జగన్ కు లేదని మరికొంతమంది విశ్లేషిస్తున్నారు.