టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణీ కుమారుడు శ్రీసింహా హీరోగా మారి నటిస్తున్న చిత్రం మత్తు వదలరా మొదట్నుండీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది.ఫస్ట్ లుక్ పోస్టర్ మొదలుకొని ఈ సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో అంచనాలు రేకెత్తిస్తుంది.
కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
మత్తు వదలరా చిత్రం టైటిల్కు తగ్గట్టుగానే ఈ చిత్ర ట్రైలర్ కూడా చాలా ఆసక్తిగా ఉంది.
థ్రిల్లర్ సస్పెన్స్తో కూడిన కామెడీగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు రితేష్ రానా డైరెక్ట్ చేశాడు.ఈ సినిమా ట్రైలర్ను కొద్దిసేపటి కింద ప్రముఖ హీరో రానా దగ్గుబాటి లాంఛ్ చేశారు.
ఈ ట్రైలర్ ఆద్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ ట్రైలర్ను చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.ఇక ఈ సినిమాకు కీరవాణి మరో కుమారుడు కాల భైరవ సంగీతం అందించాడు.
మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నుండి వస్తున్న ఈ సినిమాపై అటు ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ మంచి బజ్ క్రియేట్ అయ్యింది.ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.
మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో తెలియాలంటే 25వ తేదీ వరకు ఆగాల్సిందే.