రాజుల కాలంలో స్వయంవరం గురించి మన చరిత్ర కథల్లో ఎక్కువగా చదువుకున్నాం.పెళ్లీడుకొచ్చిన యువరాణికి సరైన వరుడు కోసం సమర్థులైన బోర్డు కోసం రాజులు అన్ని రాజ్యాల్లో ప్రకటించేవారు.
ఇక స్వయంవరానికి వచ్చిన యువరాజులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి అందులో గెలుపొందిన వారికి యువరాణిని ఇచ్చి వివాహం చేయడం, లేదంటే యువరాణి ఇష్టపడిన వారితో పెళ్లి చేయడం సాంప్రదాయంగా ఉండేది.మన హిందూ సాంప్రదాయంలో కనిపించే రాచరిక వ్యవస్థలో చాలా వివాహాలు ఇలాగే జరిగాయి.
అయితే ఇప్పుడు ఈ స్వయంవరం గురించి చెప్పుకోవడానికి ప్రధాన కారణం వేరే ఉంది.
అమెరికాలోని ఓ వ్యక్తి తాను పెంచుకుంటున్న బాతుకి స్వయంవరం ఏర్పాటు చేసి ప్రకటన ఇచ్చాడు.
దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.అమెరికాలోని బ్లూ హిల్స్ ప్రాంతానికి చెందిన మారిస్ అనే వ్యక్తి తను పెంచుకుంటున్న ఆడ బాతుకి తోడు కావాలని ప్రకటించాడు.
దీనికి సంబంధించిన పోస్టర్లు కూడా చాలా చోట్ల అతికించాడు.ఇలా చేయడానికి కారణం తను పెంచుకుంటున్న బాధితుల్లో చాలావరకు కొద్ది వారాల క్రితం మరణించాయి.దీంతో ఒంటరి అయిపోయిన ఈ ఆడ బాతు కోసం కొత్తగా ఆలోచించి ఈ విధమైన ప్రకటన ఇచ్చాడు.ఆ ప్రకటన పోస్టర్ లో తనకు సంబంధించిన అడ్రస్ కూడా పెట్టాడు.
ఈ స్వయంవరంలో భాగంగా బాతులు రెండు ఏకాంతంగా మాట్లాడుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నానని పేర్కొన్నాడు.ఇప్పుడు ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీని మీద చాలామంది ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
కొందరైతే తాము పెంచుకున్న బాతులను తీసుకొని స్వయంవరానికి కూడా వెళ్ళడానికి రెడీ అయ్యారు.