నేటి సమాజంలో మనుష్యులు వింత అలవాట్లు చేసుకుంటున్నారు.చాలా మంది బాత్రుమ్కు వెళ్లేటప్పుడు తమ ఫోన్ను తీసుకెళ్లడం అలవాటుగా చేసుకున్నారు.
వీరిలో కొంతమంది బాత్రుమ్లో గేమ్స్ ఆడుతూ తమ పని చేస్తుంటారు.అయితే ఇలాంటి పనులు ఆఫీసులో చేసే వారి సంఖ్య కూడా ఉంది.
ఇది గమనించిన ఓ కంపెనీ ఒక వినూత్న ఆలోచనకు తెరలేపింది.
తమ కంపెనీలో ఉద్యోగం చేసే ఉద్యోగులు బాత్రుమ్లో 10 నిమిషాలకంటే ఎక్కువ ఉండకూడదని, అలా ఉన్నట్లయితే బాత్రుమ్ వాసన చూస్తారని, అందులో దుర్వాసన రాకపోతే వారి పై ఆఫీసర్లకు ఫిర్యాదు చేస్తామని ఓ నోటీసును అంటించారు.
ఇది పాటిస్తే తమ కంపెనీ ఉద్యోగులు ఎక్కువసేపు బాత్రుమ్లో గడపకుండా ఉండగలరని సదరు కంపెనీ యాజమాన్యం భావిస్తోంది.
కాగా ఈ నోటీసును ఓ ఉద్యోగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్గా మారింది.కొత్త ఉద్యోగంలోకి మారాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని కొందరు కామెంట్ చేస్తే, బాత్రుమ్ వాసన చూసే ఆ అదృష్టవంతులు ఎవరు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.ఏదేమైనా బాత్రుమ్లో 10 నిమిషాల నోటీసు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.