అమెరికాలో జరిగిన ఈ సంఘటన అందరిని షాక్ కి గురిచేసింది.ఓ స్కూలు విదార్ధిని తోటి ముగ్గురు విధ్యర్దినిలు చావబాదిన ఘటన వీడియో వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ పిల్లాడు చేసిన తప్పు ఏమిటంటే.అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో గల ఓ స్కూలు లోని టైలర్ కుర్రాడు ట్రంప్ కి వీరాభిమాని.
అందుకే తన తల్లి తండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని దాచుకుని దగ్గరలోని మార్కెట్ లోకి వెళ్ళాడు.
అక్కడ ట్రంప్ 2020 అని రాసి ఉన్న ఓ టోపీ చూసి ఇష్టపడి కొనుకున్నాడు.
అంతేకాదు అక్కడి నుంచీ వీధుల్లో టోపీ పెట్టుకుని తిరుగుతూ చక్కర్లు కొట్టాడు.తరువాత రోజున స్కూలుకి అదే టోపీ పెట్టుకుని వెళ్ళగా స్నేహితులు ఎగతాళి చేయడం మొదలు పెట్టారు.మళ్ళీ మరుసటి రోజు కూడా అదే టోపీ పెట్టుకుని వెళ్ళగా స్కూలు బస్సులోనే ముగ్గురు అమ్మాయిలు ఒక్కసారిగా
టైలర్ పై పిడి గుద్దులు కురిపించారు.టోపీ లాక్కుని బయట పడేసారు.అతడిని కొడుతున్న క్రమంలో తోటి విద్యార్ధులు భయంతో అరుస్తూ బస్సులోంచి బయటకి దిగిపోయారు.తీవ్రమైన గాయాలతో ఇంటికి వెళ్ళిన టైలర్ తల్లి తండ్రులకి జరిగింది చెప్పి కొట్టినపుడు తన స్నేహితుడు తీసిన వీడియోని వారికి చూపించాడు.
దాంతో ఆ వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేసి స్కూలు యాజమన్యయానికి ఫిర్యాదు చేశారు.ఇప్పుడు ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు