యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో భారత సంతతికి చెందిన 16 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించింది.దుబాయ్ ఉమ్ అల్ క్వెయిన్లోని ఓ అపార్ట్మెంట్లోని ఆరవ అంతస్తులో నివసిస్తున్న ఆ బాలిక ఆదివారం కిటికీలోంచి జారీ పడి ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటన జరగడానికి ముందు డిసెంబర్ 6న షార్జాలోనూ ఓ బాలిక సైతం ఇదే తరహాలో అనుమానాస్పద స్థితిలో మరణించింది.ఈ రెండు ఘటనలు ఆత్మహత్యలుగా పోలీసులు భావిస్తున్నారు.
భారత్లోని కేరళకు చెందిన సదరు బాలిక రెండు నెలలుగా మానసిక సమస్యలతో బాధపడుతోందని, షార్జాలోని ఓ క్లినిక్లో చికిత్స తీసుకుంటున్నట్లు ఉమ్ అల్ క్వైన్ పోలీసులు తెలిపారు.
ఆ బాలిక బంధువు మాట్లాడుతూ.శనివారం రాత్రి పడుకునే ముందు తలనొప్పిగా ఉందనని ఆమె మాత్ర వేసుకుందని చెప్పారు.ఆ బాలిక తన తల్లి, అమ్మమ్మలతో కలిసి ఒకే గదిలో నిద్రిస్తోందని.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం నిద్ర లేచిన ఆమె ఫ్లాట్లోని కిటికీ తెరిచి దూకినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.షార్జాలో అనుమానాస్పద స్థితిలో మరణించిన బాలిక సైతం భారత సంతతికి చెందినదిగా తెలుస్తోంది.
ఆమె స్థానిక ఇండియన్ స్కూల్లో చదువుతున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.డిసెంబర్ 6న ఆమె 10వ అంతస్థు నుంచి పడి మరణించారు.