రైతులకు సంబంధించిన పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వ అధికారులు లంచం తీసుకోవడం మనకు తెలిసిన విషయమే.అయితే ఓ రైతు వద్ద లంచం తీసుకున్న అధికారి చేత తిరిగి ఆ లంచం డబ్బులు కక్కించాడు ఓ కలెక్టర్.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త తెలుగు రాష్ట్రాలలో హల్చల్ చేస్తోంది.
జగిత్యాల జిల్లాలో ఓ రైతు తన భూమి పట్టా కోసం అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగాడు.సదరు రైతు భూమి పట్టా కావాలంటే రూ.10వేల లంచం కావాలని డిమాండ్ చేశాడు రమేష్ రెడ్డి అనే వీఆర్వో.దీంతో ఆ రైతు అతడికి పదివేల నగదును ముట్టజెప్పాడు.అయినా అతడి పని మాత్రం జరగలేదు.దీంతో ఆ రైతు ప్రజావాణిలో కలెక్టర్ శరత్కు ఈ తతంగం మొత్తం వివరించాడు.
విచారణ జరిపిన కలెక్టర్ శరత్, రమేష్ రెడ్డి లంచం తీసుకున్నాడని నిర్ధారించి అతడిపై సస్పెన్షన్ వేటు వేశాడు.అంతేగాక అతడు రైతు వద్ద తీసుకున్న లంచం రూ.10వేలు కూడా తిరిగి రైతుకు ఇప్పించాడు.ఆ రైతుకు భూమిని వెంటనే పట్టా చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.