16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో భారత సంతతి వ్యక్తిని అమెరికాలోని లూసియానా పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల్లోకి వెళితే.36 ఏళ్ల విశాల్ బాబీ మోత్వాని న్యూ ఓర్లిన్స్ ఫ్రెంచ్ క్వార్టర్లోని బౌర్బన్ వీధిలో ఉన్న కామ సూత్ర క్యాబరేట్ అనే స్ట్రిప్ పబ్ను నడుపుతున్నారు.ఈ క్రమంలో 2018 నవంబర్లో మద్యం మత్తులో బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
దీనిపై ఈ వారం న్యూ ఓర్లిన్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఆ బాలికను మోత్వాని వద్ద పనిచేసే కెన్నెత్ రాన్సిఫెర్ అనే వ్యక్తి క్లబ్కు తీసుకొచ్చాడని అతనిపైనా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సదరు యువతి అసెన్షన్ పారిస్ నుంచి తన స్నేహితులతో కలిసి ఫ్రెంచ్ క్వార్టర్కు వచ్చింది.ఆ సమయంలో ఆ బాలిక గుర్తింపును తనిఖీ చేయకుండానే ఆమెను మోత్వాని క్లబ్లోకి అనుమతించడంతో పాటు మత్తెక్కే వరకు మద్యం తాగించారు.
ఈ నేపథ్యంలో రాన్సిఫెర్ తనను తాను క్లబ్ మేనేజర్గా పరిచయం చేసుకుని.యజమాని మిమ్మల్ని మేడ మీద ఉన్న కార్యాలయానికి రావాల్సిందిగా బాలికతో చెప్పాడు.అనంతరం ఆమెను మోత్వాని దగ్గరకు పంపించినట్లు పోలీసులు తెలిపారు.రాన్సిఫెర్ అక్కడి నుంచి వెళ్లిన మరుక్షణం మోత్వాని తలుపుకు గడియ పెట్టి బాలికతో అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టాడు.1,500 డాలర్లు ఇస్తానని తన కోరిక తీర్చాలని చెప్పాడు.ఆమె నిరాకరించడంతో రేటు పెంచుకుంటూ వెళ్లాడు.
అయినప్పటికీ ఆమె వినకపోవడంతో మోత్వాని అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసులో దోషిగా తేలితే విశాల్, రాన్సిఫెర్ ఇద్దరికి 25 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.