ఫేక్ వార్తలపై పూనమ్ కౌర్ సీరియస్... వాళ్ళకి గట్టిగా వార్నింగ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడానికి ఎన్నికల ముందు టీడీపీ వాళ్ళు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు.తన పేరుతో వాయిస్ లు రిలీజ్ చేసి, ఫేక్ ప్రొఫైల్ తో పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేసినట్లు పోస్టులు పెట్టి వాటిని గ్రూపులలో ట్రోల్ చేస్తూ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని డామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

 Tollywood Actress Poonam Kaur-TeluguStop.com

రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ వలన తమకి నష్టం జరిగే అవకాశం ఉందని భావిస్తున్న వైసీపీ ఇప్పటి నుంచి ప్రజలలో ఇప్పటి నుంచే అతని ఇమేజ్ ని తగ్గించే విధంగా రకరకాల కామెంట్స్ తో వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు.తాజాగా పవన్ కళ్యాణ్ దేశంలో జరుగుతున్నా అత్యాచారాల గురించి మాట్లాడుతూ కొన్ని వాఖ్యలు చేసారు.

వాటిని వక్రీకరించి దాడి చేసారు.ఇదిలా ఉంటే తాజాగా పూనం కౌర్ ని మరోసారి ఈ ఇష్యూలోకి లగే సోషల్ మీడియాలో విపరీతంగా ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నారు.

తాజాగా దీనిపై పూనమ్ కౌర్ క్లారిటీ ఇవ్వడంతో పాటు ఫేక్ న్యూస్ లు స్ప్రెడ్ చేస్తున్న వారిపై సీరియస్ అయ్యింది.తన గురించి అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ మేరకు ట్విట్టర్ లో నకిలీ వార్తలపై కౌంటర్ ఇచ్చారు.ఎన్నికలు ముగిశాయి… వారు ఇప్పుడు నా కుటుంబానికి చేయగలిగిన అన్ని నష్టాలను చేసేసారు.

కాని నకిలీ కథనాలను ప్రచారం చేసే ఇడియట్స్ అభద్రతాభావంతో ఉన్నారు.నన్ను లక్ష్యంగా చేసుకొని చవకబారుగా వ్యక్తిత్వ దాడులు చేసిన వారి లక్ష్యం నెరవేరింది.

అలాంటి వారు ఓడిపోతారు అని కామెంట్స్ చేసింది.ఇక పూనమ్ కౌర్ కామెంట్స్ ఏపీ రాజకీయాలలో ఎవరికి తగలాలో వారికి కరెక్ట్ గా తగిలాయని ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube