రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ ఆంధ్ర ప్రదేశ్ ఇండియన్ లీడర్ల ఫోరం పోలీస్ స్టేషన్లు విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది.క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పవన్ కళ్యాణ్ తరచుగా మాట్లాడుతున్నారని, వెంటనే ఆయన పై తగిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులు పేర్కొన్నారు.
సెక్షన్లు 298, 504, 295A,153A,505, 334 కింద కేసు నమోదు చేయాలని కోరారు.
రాజకీయంగా ప్రభుత్వంపై బురద చల్లేందుకే పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆయన సుడో సెక్యూలరిస్ట్ గా మాట్లాడుతున్నారని వారు విమర్శించారు.
కొద్ది రోజుల క్రితం తిరుపతి లో పర్యటించిన పవన్ తిరుపతిలో అన్యమత ప్రచారం ఎక్కువైపోయిందని, ఒక మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడారని, విజయవాడ పున్నమి ఘాట్ లో మతమార్పిడులు ఎక్కువ జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.