యంగ్ హీరో రాజ్ తరుణ్ కెరీర్ ఆరంభంలో సందడి చేశాడు.సినిమా చూసిస్తా మామ సినిమాతో ఏకంగా మాస్ మహాజారాకు జూనియర్ అంటూ ప్రశంసలు దక్కించుకున్నాడు.
ఒక యంగ్ హీరో మంచి గుర్తింపు దక్కించుకున్నప్పుడు కాస్త ఆలోచించి సినిమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
లేదంటే పరిస్థితి ఏమవుతుందో గతంలో చాలా ఉదాహరణలు చూశాం.ఇప్పుడు రాజ్ తరుణ్ కెరీర్ను చూడవచ్చు.
గతంలో వరుసగా సినిమాలు చేసిన రాజ్ తరుణ్ ఇప్పుడు మాత్రం సినిమాలు లేక ఇబ్బందులు పడుతున్నాడు.ఎట్టకేలకు దిల్రాజు బ్యానర్లో ఇద్దరి లోకం ఒక్కటే సినిమాలో నటించాడు.
ఈ సినిమాను ఈనెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.ఇక ఈ చిత్రంను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు.
ఇందులో దిల్రాజు మాట్లాడుతూ ఒక టర్కీ సినిమాను తీసుకు వచ్చి నాకు చూపించారు.ఆ సినిమా కథ నాకు నచ్చి సరే అంటూ నిర్మించేందుకు ఒప్పుకున్నాను అన్నాడు.
ఇక్కడ ఒక పుకారు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఆ టర్కీ సినిమాను చూసిన రాజ్ తరుణ్ కథ నచ్చి పారితోషికం లేకుండానే నటించేందుకు ముందుకు వచ్చాడు.నెలకు లక్ష రూపాయల జీతంతో దిల్రాజు బ్యానర్లో నటించేందుకు ఒప్పుకున్నాడు.అంటే మొత్తంగా ఈ సినిమాకు రాజ్ తరుణ్కు కనీసం అయిదు లక్షల పారితోషికం అయినా వచ్చిందో లేదో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
దిల్రాజును బతిమిలాడి మరీ ఈ చిత్రంను రాజ్ తరుణ్ చేయించినట్లుగా తెలుస్తోంది.ఈ సినిమాకు దిల్రాజు కోటి లోపు ఖర్చు చేసి ఉంటాడని, ఆయన బ్రాండింగ్తో సినిమా రెండు కోట్ల వరకు అమ్ముడు పోయింది.
సినిమాకు సక్సెస్ వస్తే అప్పుడు రాజ్ తరుణ్ కు ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో చూడాలి.