భర్తను సజీవ దహనం చేసిన భార్య

భాగ్యనగరంలో మరో ఘోరం వెలుగు చూసింది.తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన భర్తనే సజీవ దహనం చేసింది ఓ భార్య.

 Wife And Husband Vanastalipuram Hyderabad-TeluguStop.com

ఈ దారుణం వనస్థలిపురంలోని ఎస్కేడీ నగర్‌లో జరిగింది.నవంబర్ 26న జరిగిన ఈ విషయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఎస్కేడి నగర్‌లో ఉండే స్వప్న తన ప్రియుడి మోజులో పడి తన భర్త రమేశ్ ప్రాణాలు తీసింది.స్వప్నకు వెంకటయ్య అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది.వెంకటయ్యతో స్వప్న చనువుగా ఉండడాన్ని రమేశ్ గుర్తించి భార్యను చాలాసార్లు మందలించాడు.

Telugu Anastalipuram, Telugu Ups, Kills-

దీంతో తన భర్తను తప్పించేందుకు స్వప్న పథకం రచించింది.నవంబర్ 26న రమేశ్ గుడిసెలో నిద్రిస్తుండగా పెట్రోల్ పోసి నిప్పంటించింది.అది ప్రమాదంగా నమ్మబలికే ప్రయత్నం చేసింది.అయితే ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులకు ఈ విషయం తెలిసింది.తన ప్రియుడితో కలసి తానే హత్య చేసినట్టు పోలీసులు ముందు స్వప్న ఒప్పుకుంది.దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube