భాగ్యనగరంలో మరో ఘోరం వెలుగు చూసింది.తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన భర్తనే సజీవ దహనం చేసింది ఓ భార్య.
ఈ దారుణం వనస్థలిపురంలోని ఎస్కేడీ నగర్లో జరిగింది.నవంబర్ 26న జరిగిన ఈ విషయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఎస్కేడి నగర్లో ఉండే స్వప్న తన ప్రియుడి మోజులో పడి తన భర్త రమేశ్ ప్రాణాలు తీసింది.స్వప్నకు వెంకటయ్య అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది.వెంకటయ్యతో స్వప్న చనువుగా ఉండడాన్ని రమేశ్ గుర్తించి భార్యను చాలాసార్లు మందలించాడు.
దీంతో తన భర్తను తప్పించేందుకు స్వప్న పథకం రచించింది.నవంబర్ 26న రమేశ్ గుడిసెలో నిద్రిస్తుండగా పెట్రోల్ పోసి నిప్పంటించింది.అది ప్రమాదంగా నమ్మబలికే ప్రయత్నం చేసింది.అయితే ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులకు ఈ విషయం తెలిసింది.తన ప్రియుడితో కలసి తానే హత్య చేసినట్టు పోలీసులు ముందు స్వప్న ఒప్పుకుంది.దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.