పరీక్ష టైం అవుతుంది అంటే విద్యార్థులు పరుగులు పెడతారు.అలాగే స్కూల్ టైం అవుతుంది, ప్రార్థన అవుతుంది అంటే విద్యార్థులు పరుగులు పెడుతుంటారు.
అలా విద్యార్థులు పరుగులు పెట్టినట్లుగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కూడా పార్లమెంట్ ఆవరణలో పరుగులు పెట్టడం మీడియా దృష్టిని ఆకర్షించింది.పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న విషయం తెల్సిందే.
ఆ సమావేశాలకు సరైన సమయానికి హాజరు కావాలనే ఉద్దేశ్యంతో గోయల్ పరుగులు తీశాడు.
సమయం మించి పోతున్న కారణంగా హడావుడిగా మంత్రి పరుగులు పెట్టినట్లుగా స్థానిక మీడియా మిత్రులు చెప్పడం జరిగింది.
మంత్రి పీయూష్ గోయల్ ఆలస్యంగా వెళ్లినా అనేవారు ఎవరు ఉండరు.అసలు పార్లమెంట్కు వెళ్లకుండా ఉన్నా కూడా అడిగే వారు ఎవరు ఉండరు.అయినా కూడా మంత్రి మాత్రం చాలా సిన్సియర్గా పార్లమెంట్కు హాజరు అవ్వడం, అది కూడా ఆలస్యం అవుతుందని హడావుడిగా పరుగులు పెట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది.