ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు ఇటీవల మత మార్పిడిలపై తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విరుచుకు పడ్డ విషయం తెల్సిందే.కృష్ణా నది ఒడ్డున మత మార్పులు జరుగుతున్నాయని వైకాపా మత మార్పులను ప్రోత్సహిస్తుంది అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెల్సిందే.
ఈ సమయంలోనే మంత్రి కొడాలి నాని పవన్ మరియు చంద్రబాబు నాయుడుపై రివర్స్ వ్యాఖ్యలు చేశాడు.
మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.
ఉన్నట్లుండి వీరిద్దరికి హిందూ మతం గుర్తుకు వచ్చిందా అంటూ ప్రశ్నించారు.ప్రస్తుతం వీరిద్దరు కూడా హిందూ మతానికి బ్రాండ్ అంబాసిడర్స్ అయ్యారా అంటూ ఎద్దేవ చేశాడు.
రాష్ట్రంలో కులాలు మరియు మతాల పేరుతో రాజకీయాలు చేసేందుకు వీరిద్దరు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఈ సందర్బంగా నాని ఆగ్రహం వ్యక్తం చేశాడు.వైకాపా ప్రభుత్వం అన్ని మతాల వారికి స్వేచ్చనిస్తుందని, ప్రభుత్వం ఎలాంటి మత మార్పులకు పాల్పడదు అంటూ ఈ సందర్బంగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
జగన్ మరియు పవన్ కళ్యాణ్ లు నోరుమూసుకుని ఉండాలంటూ నాని హెచ్చరించాడు.