సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
కాగా ఈ సినిమాలో మహేష్ కోసం అదిరిపోయే పాటలను దేవిశ్రీ ప్రసాద్ అందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.ఇప్పటికే ఈ సినిమాలోని మొదటి లిరికల్ సాంగ్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
మైండ్ బ్లాక్ అంటూ సాగే మాస్ పాటను సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.ఈ పాట సినిమాలో చివరి పాట అని తెలుస్తోంది.
దీంతో పక్కా మాస్ పాటగా దీన్ని చిత్రీకరించారట దర్శకుడు.ఈ పాటలో మహేష్ను ఫుల్ మాస్గా చూపించేందుకు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రయత్నించాడట.
ఈ పాటకు మహేష్ బాడీ లాంగ్వేజ్కు తగ్గట్టు అదిరిపోయే స్టెప్పులను శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసినట్లు తెలుస్తోంది.ఇక ఈ పాటలో మహేష్ లుంగీ వేసుకుని డ్యాన్స్ చేసినట్లు తెలుస్తోంది.
మహేష్ లుంగీ డ్యాన్స్ ఈ పాటకే హైలైట్గా నిలుస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.రష్మిక అందాలు, మహేష్ స్టెప్పులు కలగలిసి ఈ పాట సినిమాకు మరింత బలాన్ని అందిస్తుందని చిత్ర యూనిట్ తెలిపారు.
రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.