పవన్ టూర్‌లో వాళ్లదే హవా

జనేసన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా రాయసీమ ప్రాంతంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలకు జేబుదొంగలు చుక్కలు చూపించారు.

 Picpoketers Show Talent In Pawan Kalyan Rayalaseema Tour-TeluguStop.com

పవన్ టూర్‌ను వారు చాలా తెలివిగా వినియోగించుకున్నారు.రాయలసీమ టూర్‌లో భాగంగా రేణిగుంట ఏయిర్‌పోర్టుకు చేరుకున్న పవన్‌ను కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు ఎగబడ్డారు.

ఇదే అదునుగా భావించిన జేబుదొంగలు కూడా వారిలో కలిసిపోయారు.దీంతో అక్కడ చిన్నపాటి తొక్కిసలాట జరిగింది.

దీంతో జేబుదొంగలు తమవద్ద ఉన్న కత్తెరలకు పనిచెప్పారు.అభిమానులు, కార్యకర్తల సెల్‌ఫోన్‌లు, పర్సులు అందినకాడికి దోచుకున్నారు.

దాదాపు 30 నుంచి 45 మంది తమ జేబులకు కత్తెర పడినట్లు గుర్తించారు.తమవద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్‌లు మాయమైనట్లు గుర్తించి వారు లబోదిబోమన్నారు.

కాగా వారంతా రేణిగుంట పోలీసులను ఆశ్రయించారు.అయితే ఇలాంటి సందర్భాల్లో అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు వారికి సూచించినట్లు తెలిపారు.

ఏదేమైనా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.మొత్తానికి పవన్ టూర్ ఇలా జేబుదొంగలకు బాగా పనికొచ్చిందంటూ పలువురు కామెంట్లు విసురుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube