వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి మర్డర్ మిస్టరీని పోలీసులు చేధించారు.నగరానికి చెందిన ఆమెని అత్యాచారం చేసి, ఆపై హత్య చేసిన వారిని 24 గంటలు తిరగక ముందే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన ఈ కేసు ఛేదించడాన్నిఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు బృందాలుగా విడిపోయి నిందితులని గుర్తించే పనిలోపడ్డారు.ఇక లారీ నెంబర్ ఆధారంగా నిందితులని 24 గంటల్లో అదుపులోకి తీసుకున్నారు.
అర్ధరాత్రి ఆమె బైక్ ని రిపేర్ చేస్తామని చెప్పిన లారీ డ్రైవర్ తో పాటు మరో ముగ్గురు కలిసి ఆమెని అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిర్ధారించారు.వారిని అరెస్ట్ చేసారు.
ఆమెని అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు కూడా 25 ఏళ్ల లోపు వయసు వారే.ప్రధాన మహ్మద్ పాషా గత ఐదేళ్ల నుంచి లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.
నిందితులంతా హైదరాబాద్ నుంచి రాయచూర్కు డీసీఎంలో స్టీల్ రాడ్లను తరలిస్తున్నారు.మక్తల్ మండలం జక్లేరుకు చెందిన ప్రధాన నిందితుడు మహ్మద్ పాషా, గుడిగండ్లకు చెందిన చింతకుంట చెన్నకేశవులు, జొల్లు నవీన్, జొల్లు శివను పోలీసులు నిందితులుగా నిర్ధారించి అరెస్ట్ చేశారు.
అయితే తమ పిల్లలకు ప్రియాంక రెడ్డి హత్య కేసు సంబంధం ఉందని తెలిసిన వీరి కుటుంబ సభ్యులు తమ నివాసాలకు తాళాలు వేసి పారిపోయారు.ఇక నిందితులకు ఉరిశిక్ష విధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఈ హత్య చేసిన వారిలో ఒకడి వయసు 17 సంవత్సరాలని తెలుస్తుంది.