సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాతకొన్ని సరదాగా చేసే కొన్ని ఘటనలు చాలా సీరియస్ గా మారుతున్నాయి.చేతిలో స్మార్ట్ ఫోన్, అందులో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వీడియో ని అందులో పోస్ట్ చేస్తున్నారు.
అలాంటి పోస్టులలో కొన్ని వివాదాస్పదంగా మారుతున్నాయి.కొంత మందిని తెలియకుండానే ఫేమస్ చేస్తున్నాయి.
కొంత మంది ఉద్యోగాలు పోవడానికి కారణం అవుతున్నాయి.ఇప్పుడు అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఒక ఉపాధ్యాయుడు ఉద్యోగం పోవడానికి కారణం అయ్యింది.
రాజస్థాన్ లో జలోర్ ఉపాధ్యాయులకి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ముగ్గురు ఉపాధ్యాయులు నాగిని డాన్స్ చేశారు.విరామం సమయంలో వారంతా సరదాగా గడుపుతూ ఒక మహిళా టీచర్ తో పాటు ముగ్గురు ఉపాధ్యాయులు నాగిని డాన్స్ చేశారు.
దీనికి సంబంధించిన వీడియో ఎవరో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ కావడంతో రాజస్థాన్ ప్రభుత్వం ఆ ముగ్గురు ఉపాధ్యాయులకి షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు అందులో ఒకరిని సస్పెంద్ చేసింది.సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఉద్యోగం పోవడానికి కారణం అయ్యింది.
అయితే దీనిపై సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.