ఓ మహిళ మరణించిన తన భర్త మృతదేహాన్ని 11 ఏళ్లుగా ఫ్రీజ్లో దాచివుంచిన ఘటన కలకలం రేపుతోంది.సాల్ట్ లేక్ సిటీలోని టూలే పోలీసులు కథనం ప్రకారం గత శుక్రవారం టూలేలోని రెమింగ్టన్ పార్క్ అపార్ట్మెంట్లో ఓ వృద్ధురాలు కనిపించడం లేదని పోలీసులకు సమాచారం అందింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ అపార్ట్మెంట్లో తనిఖీలు నిర్వహించగా మంచంపై వృద్ధురాలు చనిపోయి పడివుంది.ఆధారాల కోసం గాలిస్తుండగా.ఫ్రీజులో ఓ పెద్దాయన మృతదేహం కనిపించడంతో అధికారులు ఖంగుతిన్నారు.వెంటనే ఇద్దరి మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఫ్రీజ్లో లభించిన వ్యక్తిని పాల్ ఎడ్వర్డ్స్ మాథర్స్గా, మహిళను సౌరాన్ మాథర్స్గా పోలీసులు గుర్తించారు.
అయితే భర్త మరణంతో వృద్ధురాలికి సంబంధం ఉందా.? లేదా అన్నదానిపై స్పష్టత లేదు.స్థానికులు చెప్పిన దానిని బట్టి పాల్ మాథర్స్ను చివరిసారిగా 11 ఏళ్ల క్రితం తాము చూసినట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే స్థానికులు ఇచ్చిన వాంగ్మూలంలో కొందరు మాథర్స్ను చూసినట్లు చెప్పిన సమయంలో మార్పులు కనిపించాయి.కాగా సౌరాన్ మాథర్స్ 2007 నుంచి రెమింగ్టన్ పార్క్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు.
కాగా పాల్ మాథర్స్ అదృశ్యానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని టూలే పోలీస్ సార్జంట్ జెరెమీ హాన్సెన్ మీడియాకు తెలిపారు.బుధవారం ఇద్దరి మృతదేహాలకు పోస్ట్మార్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.