టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కి ఇప్పుడు మరో కష్టం వచ్చిపడింది.అప్పట్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ ఇప్పుడు తెరమీదకు రావడంతో రాజకీయంగా సంచలనం సృష్టించబోతున్నట్టుగా కనిపిస్తోంది.సుప్రీంకోర్టులో ఈ కేసుపై ఎర్లీ హియరింగ్ పిటిషన్ దాఖలవ్వడంతో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిటిషన్ ను మరోసారి దాఖలు చేశారు.2017లోనే ఆళ్ల రామకృష్టారెడ్డి ఈ పిటిషన్ ను దాఖలు చేసారు.అయితే సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ లిస్టింగ్ కాకపోవడంతో ఆర్కే సోమవారం మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టారు.
ఓటుకు నోటు సంఘటన 2015లో సంచలనం సృష్టించింది.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు ఇరుక్కున్నాడు.అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఈ కేసులో విచారణ ఎదుర్కోవడంతో పాటు, కొన్ని రోజులు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్రెడ్డి కాంగ్రెస్లో చేరారు.ఇక ప్రస్తుతం జగన్ మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేస్తూ చంద్రబాబు రాజకీయంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ఈ సమయంలో ఇప్పుడు ఓటుకి నోటు ఇలా తెరమీదకు రావడంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలయ్యింది.