అయ్యో బాబు : తెరమీదకు వచ్చిన ఓటుకు నోటు కేసు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కి ఇప్పుడు మరో కష్టం వచ్చిపడింది.అప్పట్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ ఇప్పుడు తెరమీదకు రావడంతో రాజకీయంగా సంచలనం సృష్టించబోతున్నట్టుగా కనిపిస్తోంది.సుప్రీంకోర్టులో ఈ కేసుపై ఎర్లీ హియరింగ్ పిటిషన్ దాఖలవ్వడంతో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిటిషన్ ను మరోసారి దాఖలు చేశారు.2017లోనే ఆళ్ల రామకృష్టారెడ్డి ఈ పిటిషన్ ను దాఖలు చేసారు.అయితే సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ లిస్టింగ్‌ కాకపోవడంతో ఆర్కే సోమవారం మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టారు.

 Ramakrishnareddy Filed A Petition In The Supreme Court In The Cbn Case-TeluguStop.com

ఓటుకు నోటు సంఘటన 2015లో సంచలనం సృష్టించింది.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు ఇరుక్కున్నాడు.అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఈ కేసులో విచారణ ఎదుర్కోవడంతో పాటు, కొన్ని రోజులు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు.ఇక ప్రస్తుతం జగన్ మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేస్తూ చంద్రబాబు రాజకీయంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఈ సమయంలో ఇప్పుడు ఓటుకి నోటు ఇలా తెరమీదకు రావడంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube