తెలుగుదేశం పార్టీ మీద, ఆ పార్టీ నాయకుల మీద కొద్ది రోజులుగా విమర్శలు చేస్తూ ఏపీ రాజకీయాలను హీటేక్కిస్తున్నారు మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ.దీనికి టీడీపీ నుంచి గట్టి కౌంటర్ పడినా ఆ నేతలు ఇద్దరూ అస్సలు లెక్కచేయడంలేదు.
ఒకదశలో జూనియర్ ఎన్టీఆర్ పేరుకూడా ప్రస్తావనకు వచ్చినా నందమూరి కుటుంబం నుంచి ఏ స్పందన లేకుండా పోయింది.
తాజాగా నందమూరి జయకృష్ణ తనయుడు చైతన్యకృష్ణ కొడాలి నాని, వల్లభనేని వంశీల వ్యాఖ్యలను ఖండించారు.
చంద్రబాబుపై అనవసర విమర్శలు చేస్తున్నారని, పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించిన వ్యక్తిపై వ్యక్తిగతంగా దూషణలు చేయడం సరైన పద్ధతి కాదని చైతన్యకృష్ణ మండిపడ్డారు.ఈ మేరకు చైతన్యకృష్ణ ఓ వీడియో విడుదల చేశారు.
అంతే కాదు ప్రస్తుతం నాని, వంశీ ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నారంటే దానికి కారణం మా మావయ్య చంద్రబాబు.ఆయనను ఇష్టమొచ్చినట్టు విమర్శిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు.
పార్టీ పరంగా మీకు ఏవైనా వ్యతిరేకత ఉంటే ఎక్కడివరకు చూసుకోండి కానీ వ్యక్తిగత విమర్శకు దిగితే సహించేది లేదంటూ హెచ్చరించారు చైతన్య కృష్ణ.