అంత్యక్రియలు చేసిన మూడు నెలలకు తిరిగొచ్చి షాకిచ్చాడు

అంత్యక్రియలు పూర్తి చేసిన మూడు నెలలు దాటాక ఓ కుటుంబంలో వింత చోటు చేసుకుంది.ఆ ఘటనతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

 Patna Man Returns Home After Funeral-TeluguStop.com

అయినా జరిగిన పరిణామంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఇంతకీ ఆ కటుంబంలో జరిగిన వింత ఏమిటి అనుకుంటున్నారా.? ఆ కుటుంబంలో చనిపోయి అంత్యక్రియలు జరుపుకున్న వ్యక్తి తిరిగి బతికి వచ్చాడు.

పాట్నాలోని నిసార్‌పూర్‌ గ్రామానికి చెందిన కృష్ణ మాంచి అనే వ్యక్తి ఆగస్టులో కనిపించకుండా పోయాడు.

అతడి కోసం కుటుంబ సభ్యులు అన్ని చోట్లా వెతికి ఆశలు వదులుకున్నారు.ఇదే క్రమంలో మమత్పూర్ గ్రామంలో చిన్న పిల్లలను ఎత్తుకెళ్తున్నాడనే నెపంతో ఒక మూక ఓ వ్యక్తిని బాది చంపారు.

కాగా ఆ మృతదేహం గుర్తు పట్టకుండా ఉండటంతో, అతడి దుస్తుల ఆధారంగా చనిపోయింది కృష్ణ మాంచి అనుకున్నారు.పోలీసులు కూడా అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించడంతో కుటుంబ సభ్యులు అతడికి అంత్యక్రియలు నిర్వహించారు.

Telugu Funeral, Patna, Returns, Weird-

అయితే దాదాపు మూడు నెలల తరువాత కృష్ణ మాంచి ఇంటికి తిరిగి వచ్చాడు.దీంతో ఆ కుటుంబ సభ్యులు అవాక్కయిపోయారు.తన భర్త దుస్తుల ఆధారంగా అతడిని గుర్తించలేకపోయానని కృష్ణ మాంచి భార్య తెలిపింది.తన భర్త తిరిగి ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఉందని ఆ భార్య ఆనందాన్ని వ్యక్తం చేసింది.

అయితే మృతి చెందిన వ్యక్తి ఎవరనే అంశంపై విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube