అంత్యక్రియలు పూర్తి చేసిన మూడు నెలలు దాటాక ఓ కుటుంబంలో వింత చోటు చేసుకుంది.ఆ ఘటనతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
అయినా జరిగిన పరిణామంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఇంతకీ ఆ కటుంబంలో జరిగిన వింత ఏమిటి అనుకుంటున్నారా.? ఆ కుటుంబంలో చనిపోయి అంత్యక్రియలు జరుపుకున్న వ్యక్తి తిరిగి బతికి వచ్చాడు.
పాట్నాలోని నిసార్పూర్ గ్రామానికి చెందిన కృష్ణ మాంచి అనే వ్యక్తి ఆగస్టులో కనిపించకుండా పోయాడు.
అతడి కోసం కుటుంబ సభ్యులు అన్ని చోట్లా వెతికి ఆశలు వదులుకున్నారు.ఇదే క్రమంలో మమత్పూర్ గ్రామంలో చిన్న పిల్లలను ఎత్తుకెళ్తున్నాడనే నెపంతో ఒక మూక ఓ వ్యక్తిని బాది చంపారు.
కాగా ఆ మృతదేహం గుర్తు పట్టకుండా ఉండటంతో, అతడి దుస్తుల ఆధారంగా చనిపోయింది కృష్ణ మాంచి అనుకున్నారు.పోలీసులు కూడా అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించడంతో కుటుంబ సభ్యులు అతడికి అంత్యక్రియలు నిర్వహించారు.
అయితే దాదాపు మూడు నెలల తరువాత కృష్ణ మాంచి ఇంటికి తిరిగి వచ్చాడు.దీంతో ఆ కుటుంబ సభ్యులు అవాక్కయిపోయారు.తన భర్త దుస్తుల ఆధారంగా అతడిని గుర్తించలేకపోయానని కృష్ణ మాంచి భార్య తెలిపింది.తన భర్త తిరిగి ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఉందని ఆ భార్య ఆనందాన్ని వ్యక్తం చేసింది.
అయితే మృతి చెందిన వ్యక్తి ఎవరనే అంశంపై విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.