పీకేకు జగన్‌ ఇచ్చిన మొత్తం ఎంతో తెలుసా?

వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రావడం వెనుక రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్‌ కిషోర్‌ పాత్ర ప్రముఖంగా ఉందనే విషయం తెల్సిందే.ఆయన వ్యూహాల కారణంగానే నేడు జగన్‌ సీఎం పీఠంను ఎక్కినట్లుగా రాజకీయ వర్గాల వారు బలంగా నమ్ముతున్నారు.

 Do You Know How Much Amount Jagan Give To The Prashanth Kishore-TeluguStop.com

గతంలో మోడీకి ఆ తర్వాత పలువురు ముఖ్యమంత్రులకు తన వ్యూహాలను ఇచ్చాడు.జగన్‌ వెంట గత సంవత్సర కాలంగా నడుస్తున్న ప్రశాంత్‌ కిషోర్‌ టీం సీఎం అయ్యే వరకు వెంటే నిలిచింది.

అందుకే పీకేకు జగన్‌ భారీగా రెమ్యూనరేన్‌ ఇచ్చాడంటూ వార్తలు వచ్చాయి.

ఇటీవల వైకాపా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన తమ ఖర్చుల లెక్కలో ప్రశాంత్‌ కిషోర్‌కు ఎంత ఇచ్చాం అనేది తెలియజేసింది.37.5 కోట్ల రూపాయలను ప్రశాంత్‌ కిషోర్‌కు జగన్‌ ఇచ్చినట్లుగా ఆ లెక్కలో వెళ్లడి చేయడం జరిగింది.కాని ఈ లెక్క ఎంత మాత్రం కరెక్ట్‌ కాదని జనాలు అంటున్నారు.వందల కోట్ల రూపాయలను ప్రశాంత్‌ కిషోర్‌కు వైకాపా ఇచ్చినట్లుగా చెబుతున్నారు.అదే సమయంలో ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కూడా ప్రశాంత్‌ కిషోర్‌కు వేల కోట్ల రూపాయలు కలిసి వచ్చేలా ప్రభుత్వ పనులు కూడా ఇచ్చి ఉంటారంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మొత్తానికి ప్రశాంత్‌ కిషోర్‌ పారితోషికం విషయం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube