వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విపక్షాలను ఉతికి ఆరేసేపనిలో ఉంది.ప్రస్తుతం ఇసుక మీద, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంపైనా అధికార పార్టీని ఇరుకునపెడుతూ ఇబ్బందిపెడుతోంది.
దీనిపై అధికార పార్టీ నేతలు కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతూ పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇంతవరకు బాగానే ఉన్నా ఈ విమర్శలు చేయడంలో వైసీపీ పక్షపాతం చూపించడంపై ఇప్పుడు విమర్శలు చెలరేగుతున్నాయి.
ఇంతకీ ఆ పక్షపాతం ఎవరి మీదో కాదు బీజేపీ మీదేనట.ఇప్పుడు ఇదే విషయంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది.
ప్రతి విషయంలోనూ వైసీపీని బీజేపీ టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తోంది.అయినా బీజేపీని పల్లెత్తు మాట కూడా అనలేని సంకట పరిస్థితుల్లో ఉంది.
ఇదే అదునుగా బీజేపీ మరింతగా రెచ్చిపోతూ వైసీపీ మీద విమర్శలు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది.
హిందూ ఆలయాల్లో అన్యమత ఉద్యోగులు, అన్యమత ప్రచారం కలకలం రేపుతున్నాయి.వీటిని భారతీయ జనతా పార్టీ చాలా హైలెట్ చేస్తూ బీజేపీని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తోంది.ముఖ్యంగా ఈ విషయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ట్విట్లు చేస్తూ కవ్వింపు చర్యలకు దిగుతున్నాడు.
వైసీపీకి రంగుల పిచ్చి బాగా ముదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.తాజాగా విజయవాడలో దుర్గమ్మ గుడి దిగువన ఉండే బెరం పార్కుకు శిలువతో కూడుకున్నఏసుక్రీస్తు, మరియమాత బొమ్మలను చిత్రీకరించారు.
అన్నవరం, తిరుపతి, శ్రీశైలంలో అన్యమతప్రచారం, భీమిలీ ఉత్సావాలలో మతపరమైన స్టాళ్ల ను ఏర్పాటు చేశారు.వీటన్నింటినీ బీజేపీ విస్తృతంగా ప్రచారం చేస్తూ వైసీపీని ఇబ్బంది పెడుతోంది.
ఇంత చేస్తున్నా వైసీపీ నుంచి ఒక్క మాట కూడా అనలేని పరిస్థితి.ఎందుకంటే ఇక్కడ బీజేపీని టార్గెట్ చేస్తే ఆ ఎఫెక్ట్ రివర్స్ లో ఢిల్లీ నుంచి వస్తుందని వైసీపీ భయం.అందుకే జగన్ బీజేపీ విషయంలో సాఫ్ట్ గానే ఉండాలని చూస్తున్నారు.బీజేపీ నేతలు ఎలాంటి విమర్శలు చేసినా స్పందించవద్దని పార్టీ నేతలకు ఆదేశాలు జారీచేసినట్టు తెలుస్తోంది.
ఇదే సమయంలో కేంద్రం నుంచి వచ్చే బీజేపీ నాయకులకు రచ్చ మర్యాదలు చేస్తూ తమపై ఎటువంటి ఆగ్రహం ప్రదర్శించవద్దు అన్నట్టుగా వైసీపీ వ్యవహరిస్తోంది.