తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చీప్ ఎన్నికకు రంగం సిద్దం అయ్యింది.హుజూర్ నగర్ ఎన్నికల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీప్కు రాజీనామా చేసిన విషయం తెల్సిందే.
ఆ స్థానంను ఎవరితో భర్తీ చేయాలా అంటూ కాంగ్రెస్ అధినాయకత్వం చాలా కసరత్తు చేస్తోంది.పార్టీ అధినాయకత్వం ఇప్పటికే పర్యవేక్షకుడిని పంపించి ఇక్కడ పరిస్థితులు మరియు పార్టీని ముందుడి నడిపించే వ్యక్తి ఎవరైతే బాగుంటుందనే విషయాలను తెలుసుకునేందుకు రిపోర్ట్ తెప్పించుకుంది.
టీ పీసీసీ చీప్ పదవి కోసం పదుల సంఖ్యలో దరకాస్తులు వెళ్లువెత్తినట్లుగా ఆ పార్టీ నాయకత్వం చెప్పుకొచ్చింది.
ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా టీపీసీసీ చీప్ పదవి కోసం పోటీ పడుతున్నట్లుగా ప్రకటించాడు.
చీప్ పదవి కోసం తన బయోడేటాను, తన రాజకీయ ప్రస్థానంను అధినాయకత్వంకు పంపించినట్లుగా జగ్గారెడ్డి చెప్పుకొచ్చాడు.పార్టీ అధినాయకత్వం ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా కూడా స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా ఆయన ప్రకటించాడు.
అయితే చీప్ రేసులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు రేవంత్ రెడ్డిల పేర్లు బలంగా వినిపిస్తుండగా ఇంకా పలువు కాంగ్రెస్ లీడర్ల పేర్లు కూడా చర్చకు వస్తున్నాయి.అధినాయకత్వం ఎవరికి పట్టం కడుతుందో చూడాలి.
రేవంత్ రెడ్డికి పట్టం కడితే వ్యతిరేకత ఎక్కువ వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.