టెస్టులో బంగ్లాను రఫ్పాడించిన భారత బౌలర్లు

టీ20 సిరీస్‌ను సాధించిన విజయానందంలో ఉన్న టీం ఇండియా టెస్టు సిరీస్‌ను గ్రాండ్‌గా మొదలు పెట్టింది.బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో మొదటి టెస్టు మ్యాచ్‌లో మొదటి రోజు ఆటలో టీం ఇండియా ఆటగాళ్లు పూర్తి సత్తా చాటారు.

 India Bowlers And Batsmans Upper Hand In Bangladesh-TeluguStop.com

ముఖ్యంగా బౌలర్లు కుమ్మేశారు.టీం ఇండియా బౌలర్ల దాటికి బంగ్లా బ్యాట్స్‌మన్‌లు కుదేళయ్యారు.

కేవలం 150 పరుగులకే ఆలౌట్‌ అయ్యారు.కొందరు బ్యాట్స్‌మన్‌ పరుగులు చేయకుండా వికెట్లు నిలుపుకునేందుకు ప్రయత్నించారు.

ఆ సమయంలో బౌలర్లు కాస్త అసహనంకు గురయ్యారు.

రోజంతా ఆడి కేవలం 150 పరుగులు మాత్రమే చేశారు అంటే బంగ్లా బ్యాట్స్‌మన్‌ లు టీం ఇండియా బౌలర్లను ఏ రేంజ్‌లో సహనాన్ని పరీక్షించారో అర్థం చేసుకోవచ్చు.

అయినా కూడా వికెట్లను తీయడంలో ఇండియా బౌలర్లు కుమ్మేశారు.బౌలర్లు వరుసగా వికెట్లు తీయడంతో బంగ్లా ఇన్నింగ్స్‌ 150 పరుగుల వద్ద నిలిచి పోయింది.ఆ తర్వాత బ్యాటింగ్‌ ప్రారంభించిన టీం ఇండియా ఆట ముగిసే సమయానికి కేవలం 8 పరుగులు చేసింది.వికెట్లు ఏమీ నష్టపోకుండా మయాంక్‌ 6 మరియు రోహిత్‌ 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

రేపటి ఆటలో టీం ఇండియా 300 పరుగులు చేసి డిక్లెర్‌ చేసే అవకాశం ఉందని క్రీడా నిపుణులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube