పోలీస్ స్టేషన్కు వెళ్లి తన ప్రతాపం చూపించాలని చూసిన ఓ లేడీ పోలీస్.కాదు కిలాడీ పోలీస్ ఆటను రట్టు చేశారు తమిళనాడు పోలీసులు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.చిదంబరం నగర పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో మందక్కరై ప్రాంతానికి చెందిన చక్రపాణి అనే వ్యక్తి మద్యం మత్తులో వాహనం నడిపిస్తూ పట్టుబడ్డాడు.
దీంతో అతడిపై కేసు నమోదు చేసి అతడి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ విషయాన్ని చక్రపాణి తన బంధువు రాజదురై, అతడి భార్య సూర్యప్రియకు చెప్పి వాపోయాడు.
దీంతో సూర్యప్రియ తన దగ్గర ఉన్న పోలీసు డ్రెస్ వేసుకుని చిదంబరం పోలీసు స్టేషన్కు వెళ్లింది.తాను నీలాంగరై పోలీస్ స్టేషన్లో ఎస్ఐనని చెప్పుకొచ్చింది.
ఆమె వ్యవహారంలో ఏదో తేడా ఉందని గ్రహించిన పోలీసులు నీలాంగరై స్టేషన్కు ఫోన్ చేసి అసలు విషయం తెలుసుకున్నారు.అక్కడ ఆమె పేరుతో ఎవరూ పనిచేయడం లేదని తేలింది.
అంతేగాక సూర్యప్రియ తన భర్తతో పాటు చక్రపాణితో కలిసి వసూళ్లకు పాల్పడేదని గుర్తించారు పోలీసులు.ఈ విషయాలు తెలుసుకున్న పోలీసులు ఆమెతో పాటు రాజదురై, చక్రపాణిలను అరెస్ట్ చేసారు.
కేసు నమోదు చేసి వారిని విచారిస్తున్నారు.మొత్తానికి స్టేషన్కు వెళ్లిన కిలాడీ లేడీ అడ్డంగా బుక్కయ్యిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.