అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో రెండవ పెళ్లిలు చాలా కామన్గా చూస్తూ ఉంటాం.కాని ఇండియాలో మాత్రం రెండవ పెళ్లిలు కాస్త తక్కువే అని చెప్పాలి.
ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత భర్త నుండి విడిపోయినా లేదంటే భర్త చనిపోయిన ఆడవారు పెళ్లి చేసుకునేందుకు అస్సలు ఆసక్తి చూడం లేదు అంటూ ఆమద్య ఒక సర్వేలో వెళ్లడయ్యింది.పిల్లలను పెంచుకుంటూ శేష జీవితంను గడిపేస్తూ ఉంటారు.
ఆ సమయంలో వారు అనేక ఇబ్బందులు ఎదురైనా సింగిల్ మదర్గా ధైర్యంగా పోరాడుతూ ఉంటుంది.
అస్తా వర్మ అనే అమ్మాయి తన తల్లికి వరుడు కావాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
తాను పెళ్లి చేసుకుని వెళ్లి పోతే అమ్మ పరిస్థితి ఏంటా అంటూ ఆమె ఆందోళన చెందుతుంది.అందుకే పెళ్లి చేసుకునే ముందే అమ్మకు పెళ్లి చేసి ఆమె జీవితాన్ని సెటిల్ చేయాలని భావిస్తుంది.
ఆస్తా వర్మ చిన్న తనంలోనే ఆమె తల్లి విడాకులు తీసుకుందట.పాపను పెంచుకుంటు జీవితాన్ని సాగిస్తూ వచ్చింది.45 ఏళ్ల తన తల్లికి 50 ఏళ్ల వరుడు కావాలంటూ ఆస్తా ట్వీట్ చేసింది.
తన తల్లికి కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాలు, ఉండకూడని అవలక్షణాలను కూడా ఆమె చెప్పింది.50 ఏళ్ల మంచి అందగాడు మా అమ్మకు భర్తగా కావాలని కోరుకుంటున్నాను.మా అమ్మను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి పూర్తిగా శాఖ హారి అయ్యి ఉండటంతో పాటు మందు తాగే అలవాటు ఉండకూడదు.
అలాగే మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి అయ్యి ఉండాలి ఇంకా మంచి ఆస్తి పాస్తులు ఉండాలని పోస్ట్ పెట్టింది.
50 ఏళ్ల వరుడు అంటే దొరకుతాడు.ఈజీగానే ఆమెకు వరుడు లభిస్తాడు.కాని అస్తా వర్మ పెట్టిన కండీషన్స్తో వరుడు లభించడం అంటే కాస్త కష్టమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరి కొందరు మీ అమ్మ చాలా బాగుంది నేను పెళ్లి చేసుకుంటాను అంటూ యువకులు కూడా ముందుకు వస్తున్నారు.మీ అమ్మను కాదు కాని నిన్ను పెళ్లి చేసుకునేదుకు నేను సిద్దంగా ఉన్నాను, మనం ఇద్దరం కలిసి ఆంటీకి పెళ్లి చేద్దాం అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి అస్తా వర్మ చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది.