ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన చిదంబరం ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న విషయం తెల్సిందే.ఆయన గత రెండు నెలలుగా జైల్లోనే ఉంటున్నాడు.
కేంద్ర మంత్రిగా దేశంలో చాలా క్రియాశీలక వ్యక్తిగా పేరు దక్కించుకున్న చిదంబరం ఇప్పుడు జైల్లో ఉండటం ఎంత విధి వైపరిత్యమో అర్థం చేసుకోవచ్చు.కాంగ్రెస్ పార్టీ ఈయన్ను బయటకు తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.
సుప్రీం కోర్టు కూడా ఈయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో గత రెండు నెలలుగా కూడా ఈయన బెయిల్ రాక జైల్లోనే ఉన్నాడు.
ఇటీవల చిదంబరం అనారోగ్యంకు గురయ్యాడు.
దాంతో ఆయన ఎయిమ్స్కు తరలించబడ్డాడు.ఆయన ఆరోగ్యం కుదుట పడటంతో మళ్లీ జైలుకు చేరాడు.
ఈ సమయంలోనే మద్యంతర బెయిల్ పిటీషన్ వేసిన చిదంబరం అనారోగ్యం కారణంగా తనకు బెయిల్ ఇప్పించాలంటూ కోరాడు.అందుకు ఒప్పుకోని కోర్టు మీ ఆరోగ్యం అన్ని విధాలుగా బాగానే ఉందని వైధ్యులు చెప్పారు.
కనుక మీరు బెయిల్పై బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు అంటూ కోర్టు సూచించింది.ఇదే సమయంలో కోర్టు తీహార్ జైలు అధికారులను ఆయనకు ప్రత్యేకమైన వసతులు ఏర్పాటు చేయాలంటూ సూచించడం జరిగింది.