తన భార్య అందంగా లేదని ఓ ప్రబుద్ధుడు విడాకులు తీసుకున్న ఘటన హైదరాబాద్లోని కుషాయిగూడలో చోటు చేసుకుంది.అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.
కుషాయిగూడకు చెందిన ముస్తఫాకు రుక్సానా(25)తో మూడు నెలల క్రితం వివాహం జరిగింది.తొలుత వీరి కాపురం సజావుగానే జరగిందని వారి తల్లిదండ్రులు అన్నారు.
తన భార్య పళ్లు ఎత్తుగా ఉన్నాయని ముస్తాఫా తలాక్ చెప్పి వెళ్లిపోయాడని బాధితురాలి కుటుంబ సభ్యులు వాపోయారు.దీంతో రుక్సానాకు కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించింది.తన భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ పోలీసుల వద్దకు చేరింది.తనకు న్యాయం చేయాలంటూ ఆమె పోలీసులను కోరింది.
దీంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భార్య అందంగా ఉందా లేదా అని పెళ్లికి ముందు తెలియదా అంటూ మహిళా సంఘాలు ముస్తఫాను తిట్టిపోస్తున్నాయి.
కాగా ముస్తఫాను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.