రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వహిస్తాం.ముఖ్యంగా ఏదైనా వాహనం నుండి ప్రమాదం ఉంటుందని తాము నడిపే వాహనంతో పాటు ఇతర వాహనాలను కూడా అప్రమత్తంగా చూస్తూ ఉంటారు ప్రయాణికులు.
అయినా కూడా రోజుకు ఎన్నో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.తాజాగా పిట్స్బర్గ్లో చోటు చేసుకున్న ఓ అనుకోని ప్రమాదంలో ఓ బస్సు పాక్షికంగా దెబ్బతింది.
పిట్స్బర్గ్లో ఉదయం బిజీబిజీగా ఉన్న రోడ్డుపై రద్దీ ఎక్కువగా ఉంది.ఈ సమయంలో రోడ్డుపై హఠాత్తుగా భూమి కుంగిపోయి ఓ భారీ గుంత ఏర్పడింది.
దీంతో రోడ్డుపై ఉన్న ఓ బస్సు అందులోకి పడిపోయింది.అయితే ఈ ఘటనలో ఎవ్వరికీ పెద్ద గాయాలు కాకపోవడం గమనార్హం.
ఈ ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు బస్సులో డ్రైవర్తో పాటు ఓ 56 ఏళ్ల వృద్ధురాలు మాత్రమే ఉన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని బస్సులో ఉన్నవాళ్లను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.రోడ్డుపై ఏర్పడిన గుంత కారణంగా జరిగిన ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.