వాళ్లు తల్చుకుంటే జగన్‌ను ఏమైనా చేయవచ్చు

ప్రస్తుతం భారతదేశం మొత్తం కూడా బీజేపీ చేతిలో నడుస్తున్నట్లుగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.మోడీ మరియు అమిత్‌ షాలకు రాజ్యాంగంతో పని లేదని, వారు ఏదనుకుంటే అది జరిగేలా చేస్తారంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

 Farmmar Mp Undavalli Arun Kumar Comments On Jagan And Modhi Governament-TeluguStop.com

తమిళనాడుకు ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న శశికళను వారు ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకు వెళ్లారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన ఆమె జైలుకు వెళ్లింది అంటే ఆమె కేసుల విషయంలో కేంద్రం ఎంతగా పట్టించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని ఆయన అన్నారు.

ఇక జగన్‌ విషయంలో కూడా బీజేపీ ఏదైనా అనుకుంటే అది చేయగలరి అన్నారు.ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు అవ్వడంపై మినహాయింపు ఇవ్వాలంటూ కోర్టును జగన్‌ కోరగా అందుకు సీబీఐ అడ్డుకోవడం కూడా బీజేపీ చేయించిందని ఉండవల్లి అన్నారు.

బీజేపీకి లొంగి వైకాపా ప్రభుత్వం సాగాలని, జగన్‌ ఎప్పుడు కూడా తమకు భయపడాలనేది వారి ఉద్దేశ్యం అయ్యి ఉంటుందని అందుకే కేసుల విషయంలో అప్పుడప్పుడు హడావుడి చేయిస్తున్నారు అంటూ బీజేపీపై విమర్శలు గుప్పించారు.మొత్తానికి బీజేపీ దేశాన్ని ఆటాడిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube