సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న లేటెస్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర యూనిట్ అదిరిపోయే దీపావళి బాంబును వదిలారు.ఈ రోజు ఉదయం లేడీ అమితాబ్ విజయశాంతి ఫస్ట్లుక్ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు మహేష్ ఫ్రెష్ లుక్ను రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ చూస్తుంటే దీపావళికి రేసులో మహేష్ ఎంట్రీ ఇలా ఇచ్చాడా అని అనిపించడం ఖాయం.
సాధారణంగా నిలబడి, లేక పరిగెడుతూ ఉండే మహేష్ పోస్టర్లు శ్రీమంతుడు సినిమా నుండి వైవిధ్యాన్ని సంతరించుకున్నాయి.
ఆ సినిమాలో సైకిల్పై వచ్చిన మహేష్ ఈ దీపావళికి ‘సరిలేరు నీకెవ్వరు’ అనేలా బులెట్ బండిపై దిగాడు.బాబు లేటుగా వచ్చినా లేటెస్టుగా ఉన్నాడనే చందానా మహేష్ అదిరిపోయే లుక్ ఫ్యాన్స్కు పిచ్చెక్కించేసింది.
ఈ సినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.అయితే ఇటీవల కర్నూలు బుర్జు బ్యాక్డ్రాప్తో రిలీజ్ అయిన పోస్టర్తో అసలు ఈ సినిమా కథేంటో అర్ధం కావడం లేదని ఆడియెన్స్ ఫీలవుతున్నారు.మరి అనిల్ రావిపూడి ఈ సినిమా కథను ఎలా రాశాడనేది సినిమా రిలీజ్ తరువాతే తెలుస్తోంది.రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నారు.