ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ గతంలో బీజేపీ ప్రకటించిన విషయం తెల్సిందే.అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ మాట మార్చడం, ఆ తర్వాత అసలు హోదా సాధ్యం కాదని ప్రత్యేక ప్యాకేజ్ అంటూ ప్రకటించడం జరిగింది.
వైకాపా.తెలుగు దేశం పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేశాయి.
అయినా కూడా బీజేపీ కరగలేదు.మోడీ రెండవ సారి ప్రధాని అయిన తర్వాత అయినా ప్రత్యేక ప్యాకేజీ గురించి ఏమైనా ఛాన్స్ ఉంటుందా అనుకుంటే ఈసారి కూడా మొండి చేయే చూపిస్తున్నారు.
ప్రత్యేక హోదా విషయమై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ స్పందించారు.ప్రత్యేక హోదా అనేది ఏపీకి టెక్నికల్గా సాధ్యం కాదని, హోదాతో వచ్చే సాయం కంటే కూడా అధికంగా రాష్ట్రానికి తీసుకు వస్తామని అన్నాడు.
ఇప్పటికే ఏపీకి బీజేపీ ప్రభుత్వం చాలా ఇచ్చిందన్న కన్నా లక్ష్మినారాయణ రాబోయే రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఏపీపై ప్రత్యేక శ్రద్ద కనబర్చుతుందనే నమ్మకంను వ్యక్తం చేశాడు.తప్పకుండా ఏపీని కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎలాంటి అన్యాయం చేయదని హామీ ఇచ్చాడు.