అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ధఢక్ చిత్రం తో పరిచయం అయిన విషయం తెలిసిందే.కుమార్తె సినిమా రిలీజ్ కు కొద్దీ రోజుల ముందే ప్రముఖ హీరోయిన్ శ్రీదేవి మృతి చెందింది.
ధఢక్ లో తన నటనతో అమ్మను గుర్తు చేసిన జాన్వీ ప్రేక్షకుల మనసును బాగానే గెలుచుకుంది.మరాఠిలో సూపర్ హిట్ అయిన ‘సైరత్’కు రీమేక్గా వచ్చిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ నిర్మించగా బాక్సఫీస్ వద్ద బాగానే అనిపించింది.
అయితే ఆ చిత్రం తరువాత ప్రస్తుతం జాన్వీ.‘కార్గిల్ గాళ్’, ‘రూహ్ అఫ్జా’, ‘తక్త్’ సినిమాల్లో బిజీ గా మారిపోయింది.
అయితే ఒకపక్క బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న ఈ ముద్దు గుమ్మ ఇప్పుడు తన దృష్టి టాలీవుడ్ పై పెట్టినట్లు తెలుస్తుంది.సౌత్ లో తనకు ఎంతో ఇష్టమైన హీరో విజయ్ దేవర కొండా అని చెప్పిన ఈ అమ్మడు తన టాలీవుడ్ డెబ్యూ కూడా అతడి పక్కనే చేయనున్నట్లు సమాచారం.
ఈ బ్యూటీని టాలీవుడ్కు పరిచయం చేసే బాధ్యతను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీసుకున్నారని టాక్.ఇటీవలే ‘ఇస్మార్ట్ శంకర్’తో సూపర్ హిట్ అందుకున్న పూరి, తన నెక్ట్స్ సినిమాను విజయ్ దేవరకొండతో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.
ఆ చిత్రానికి ‘ఫైటర్’ టైటిల్ ని కూడా ఖరారు చేశారు.అయితే ఈ చిత్రంలో విజయ్ ఒక ఫైటర్ గా కనిపిస్తుండగా విజయ్ కు జోడీ గా జాన్వీ ని ఎంపిక చేయాలని పూరీ భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జాన్వీ విజయ్ పక్కన టాలీవుడ్ లో తెరంగ్రేటం చేయనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.ఇంతకు ముందు కూడా జాన్వీ తెలుగులో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
కానీ నిజం కాలేదు.ఇప్పుడు మరోసారి విజయ్తో జాన్వీ అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఇక శ్రీదేవి కూడా తెలుగు సినిమాల్లో నటించే నార్త్లో పాగా వేసిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు జాన్వీ కూడా నార్త్ లో బిజీ గా ఉంటూ సౌత్ లో కూడా తన సత్తా చూపించాలని భావిస్తున్నట్లు సమాచారం.
మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది అన్న విషయం తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగాల్సిందే
.