దేశ ప్రధాని నరేంద్ర మోడీ వెంట మెగా కాంపౌండ్ తమకు ఉన్న ఢిల్లీ పరిచయాలతో పడుతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ప్రధాని మోడీకి ఎట్టి పరిస్థితుల్లో సైరా చిత్రంను చూపించే ఉద్దేశ్యంతో మెగాస్టార్ చిరంజీవి మరియు చరణ్ లు హై లెవల్ రికమండేషన్ తో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
కేంద్ర మంత్రులు మరియు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ సినిమాను ఇప్పటికే చూశారు.ఇప్పుడు ప్రధాని మోడీకి చూపించాలని మెగా కాంపౌండ్ తాపత్రయం పడుతోంది.
ఇందుకు గల కారణాలు కూడా చాలానే ఉన్నాయి.
హిందీలో ఈ చిత్రం దారుణమైన పరాజయం పాలయ్యింది.
అయినా కూడా ట్యాక్స్ల రూపంలో భారీ మొత్తానికి వసూళ్లు చేశారు.జీఎస్టీ అంటూ కోట్లాది రూపాయలను ప్రభుత్వం వసూళ్లు చేసింది.
మోడీకి ఈ సినిమాను చూపించి దేశ భక్తి సినిమా, ఒక మంచి మెసేజ్ సినిమా కనుక ఈ సినిమాకు జీఎస్టీ తప్పించడంతో పాటు పన్నును తొలగించాలని ప్రధానిని కోరేందుకు మెగా ప్రయత్నాలు చేస్తున్నారు.సినిమాకు బ్రేక్ ఈవెన్ రాలేదు కనుక పన్ను భారం అంతా కూడా నిర్మాత అయిన రామ్ చరణ్ పై పడుతోంది.
ఆ పన్ను భారంను తగ్గించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే ఏపీ సీఎం జగన్కు సినిమాను చూపించారు.కేంద్ర మంత్రులకు చూపించారు.ఇప్పుడు ప్రధానికి చూపించడం ద్వారా సినిమాకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని ఆశ పడుతున్నారు.ఒక వేళ మోడీ సినిమాను చూసి పన్ను మినహాయింపు ఇస్తే దాదాపుగా 10 కోట్ల మేరకు నిర్మాత చరణ్ కు సేవ్ అవ్వడం ఖాయం అంటూ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.