ప్రధాని వెంట పడుతున్న మెగా కాంపౌండ్‌, ఎందుకో తెలుసా?

దేశ ప్రధాని నరేంద్ర మోడీ వెంట మెగా కాంపౌండ్‌ తమకు ఉన్న ఢిల్లీ పరిచయాలతో పడుతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ప్రధాని మోడీకి ఎట్టి పరిస్థితుల్లో సైరా చిత్రంను చూపించే ఉద్దేశ్యంతో మెగాస్టార్‌ చిరంజీవి మరియు చరణ్‌ లు హై లెవల్‌ రికమండేషన్‌ తో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

 Mega Compound Wants To Show Sye Raa Movie To The Prime Minister-TeluguStop.com

కేంద్ర మంత్రులు మరియు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ సినిమాను ఇప్పటికే చూశారు.ఇప్పుడు ప్రధాని మోడీకి చూపించాలని మెగా కాంపౌండ్‌ తాపత్రయం పడుతోంది.

ఇందుకు గల కారణాలు కూడా చాలానే ఉన్నాయి.

హిందీలో ఈ చిత్రం దారుణమైన పరాజయం పాలయ్యింది.

అయినా కూడా ట్యాక్స్‌ల రూపంలో భారీ మొత్తానికి వసూళ్లు చేశారు.జీఎస్టీ అంటూ కోట్లాది రూపాయలను ప్రభుత్వం వసూళ్లు చేసింది.

మోడీకి ఈ సినిమాను చూపించి దేశ భక్తి సినిమా, ఒక మంచి మెసేజ్‌ సినిమా కనుక ఈ సినిమాకు జీఎస్టీ తప్పించడంతో పాటు పన్నును తొలగించాలని ప్రధానిని కోరేందుకు మెగా ప్రయత్నాలు చేస్తున్నారు.సినిమాకు బ్రేక్‌ ఈవెన్‌ రాలేదు కనుక పన్ను భారం అంతా కూడా నిర్మాత అయిన రామ్‌ చరణ్‌ పై పడుతోంది.

Telugu Chiranjeevi, Narendra Modi, Sye Raa, Syeraa, Venkaiah-

  ఆ పన్ను భారంను తగ్గించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే ఏపీ సీఎం జగన్‌కు సినిమాను చూపించారు.కేంద్ర మంత్రులకు చూపించారు.ఇప్పుడు ప్రధానికి చూపించడం ద్వారా సినిమాకు ఏమైనా హెల్ప్‌ అవుతుందేమో అని ఆశ పడుతున్నారు.ఒక వేళ మోడీ సినిమాను చూసి పన్ను మినహాయింపు ఇస్తే దాదాపుగా 10 కోట్ల మేరకు నిర్మాత చరణ్‌ కు సేవ్‌ అవ్వడం ఖాయం అంటూ ట్రేడ్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube