టాలీవుడ్ ప్రముఖ నిర్మాత పీవీపీని ఇటీవల తన అనుచరులతో కలిసి బెదిరించిన కేసులో తెలుగు నిర్మాత బండ్ల గణేష్ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.తన అనచరులతో కలిసి వైసీపీ నేత పీవీపీని ఇటీవల బండ్ల గణేష్ బెదిరించినట్లు ఆయన జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో బండ్ల గణేష్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే జూబ్లిహిల్స్ పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆయన పరారీలో ఉన్నారు.కాగా తాజాగా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.
పోలీసులు నిర్మాత బండ్ల గణేష్పై 420, 448, 506 r/w 43 ipc సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా.ఆయన పరారీలో ఉన్నారు.
ఇప్పుడు బండ్ల గణేష్ను అరెస్ట్ చేసి బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు పోలసులు.
గతంలోనూ బండ్ల గణేష్ ఇతరులతో కూడా గొడవ పడిన ఘటనలు చూశారు.
టెంపర్ సినిమా సమయంలో పీవీపీతో గొడవకు దిగిన ఈయన అంతకు ముందు హీరో కమ్ నిర్మాత సచిన్తో కూడా గొడవకు దిగిన విషయం విదితమే.