చిరంజీవి తన 151వ సినిమా సైరాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.ఆ సినిమా వారం లోపే 100 కోట్ల షేర్ ను దక్కించుకుంది.
ఈ సందర్భంగా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.అందులో చిరంజీవి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి.
ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న మెగా మల్టీ స్టారర్ చేయాలని తనకు ఉందని క్లారిటీ ఇచ్చాడు.చిరంజీవి వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్ లో ఆశలు కలిగిస్తున్నాయి.
సాధ్యం కాదని అనుకుంటున్న మెగా మనం త్వరలోనే పెట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది.
అక్కినేని ఫ్యాన్ కోసం అక్కినేని హీరోలు “మనం” సినిమా చేశారు.
ఆ సినిమాలో ముగ్గురు అక్కినేని హీరోలు నటించారు.ఆ సినిమా తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం.
మూడు తరాల అక్కినేని హీరోలు నటించిన ఆ సినిమా ఒక విభిన్నమైన కథతో దర్శకుడు విక్రమ్ తెరకెక్కించాడు.ఇప్పుడు అలాంటి కథతో వస్తే మెగా మల్టీ స్టారర్ కూడా ఒకే అయ్యే అవకాశం ఉంది.
చిరు మాట్లాడుతూ.నాకు చరణ్ తో నటించడం ఎంత ఇష్టమో పవన్ తో నటించడం కూడా అంతే ఇష్టం.మంచి కథతో వస్తే నాకు చరణ్ కు పవన్ తో నటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చిరు అన్నారు.అయితే పవన్ రాజకీయాల కారణంగా సినిమాలకు దూరం అయ్యాడు.
కానీ మంచి కథ వస్తే తప్పకుండా చిరు మరియు చరణ్ లతో నటించేందుకు తప్పకుండా ముందుకు వస్తాడని అంతా నమ్మకంగా చెబుతున్నారు.మరి మెగా ఫ్యాన్స్ కల అయిన ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు వచ్చేనో చూడాలి.