అమెరికాలో ఉన్న అతిపెద్ద తెలుగు సంఘం తానా.ఈ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే ప్రతీ సేవా కార్యక్రమాలు ఎంతోమందికి మార్గ దర్సకంగా ఉంటాయి.
అమెరికాలో తెలుగు వారికి ఎక్కడ ప్రమాదం జరిగినా సరే సత్వరమే సేవలు అందించడానికి తానా టీం స్క్వేర్ విభాగాన్ని ప్రారంభించింది.ఈ విభాగం ఇప్పటికే ఎంతో మంది ప్రమాదంలో గాయాల పాలైన, లేదా మరణించిన తెలుగు వారికి ఆసరాగా నిలిచింది.అయితే
ప్రమాదవశాత్తు అమెరికాలో మరణించిన వారి మృతదేహాలని భారత్ తరలించి అక్కడి నుంచీ వారి వారి ప్రాంతాలకి తరలించడానికి ఉండే ప్రక్రియ మొత్తాన్ని తానా టీంస్క్వేర్ దగ్గరుండి చూసుకుంటుంది.ఈ క్రమంలోనే తానా చేస్తున్న ఈ సేవని గుర్తించిన అమెరికాలోని ఓ మహిళ ఎన్నారై టీంస్క్వేర్ విభాగానికి 15 వేల డాలర్ల విరాళం ప్రకటించారు.ఇండియన్ కరెన్సీలో అది మొత్తం 10 లక్షల పైమాటే.
పాలడుగు శిరీష కి తానా టీంస్క్వేర్ చేసే ఈ కార్యక్రమం ఎంతగానో నచ్చిందని.
మరింత మందికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభాగా ఉండేలా తానూ ఈ డబ్బుని విరాళంగా ఇచ్చానని ఆమె తెలిపారు.విమానాశ్రయం నుంచీ స్వస్థలాలకి మృత దేహాలు తరలించేందుకు ఈ సొమ్ముని వాడాలని ఆమె కోరినట్టుగా టీంస్క్వేర్ విభాగం చైర్మెన్ కొల్లా అశోక్ బాబు తెలిపారు.