టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పిడుగుపాటు కు గురైన విమానం!

ఎయిర్ ఇండియా కు చెందిన ఒక విమానం పిడుగుపాటుకు గురైనట్లు తెలుస్తుంది.శనివారం రాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.

 Air India Flights Suffer Damages After Severe Thunderstorms-TeluguStop.com

ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న ఎయిర్ ఇండియా కు చెందిన AI-467 విమానం శనివారం రాత్రి 7:28 గంటల సమయంలో ఢిల్లీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యింది.అయితే రాత్రి 9:40 గంటలకు విజవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉండగా,ఈ మధ్యలో పిడుగుపాటుకు గురైనట్లు తెలుస్తుంది.విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఉరుములు,పిడుగులతో కూడిన వర్షం ప్రారంభమవ్వడం తో నేరుగా విమానం మీద పిడుగు పడకున్నప్పటికీ దాని ప్రభావం మాత్రం విమానం పై పడినట్లు సమాచారం.దీనితో ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరూ గాయపడనప్పటికీ కొంత మంది సిబ్బంది మాత్రం గాయపడినట్లు తెలుస్తుంది.

అయితే పిడుగు పాటుకు గురైన విమానం ఆ సమయంలో విమానం గాల్లో ఊయలలా అటూ ఇటూ ఊగిపోయిందట.

Telugu Ai, Air India Plane-

 

అయితే ప్రయాణికులు అందరూ కంగారు పడిపోయినప్పటికీ పైలట్ అప్రమత్తతతో వ్యవహరించి సురక్షితంగా విమానం ను ల్యాండ్ చేయడం తో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తుంది.దీనితో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు.అయితే ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube