వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా కోడెల ఇంకా ఆయన కుటుంబ సభ్యులపై పలు కేసులు నమోదు అయ్యాయి.మరీ చిల్లర కేసులు ఆయనపై పడ్డాయి.
దాంతో కోడెల పరువు పోయింది.ఒకానొక సమయంలో పార్టీ నాశనం కాకుండా ఉండాలంటే, ఆయన అవినీతి పార్టీకి అంటకుండా ఉండాలి అంటే వెంటనే ఆయన్ను సస్పెండ్ చేయాలని పార్టీ నాయకులు కొందరు అన్నారు.
ఈమద్య కాలంలో ఆ వాదన మరీ ఎక్కువ అయ్యిందట.
చంద్రబాబు నాయుడు కూడా ఆ విషయమై ఒక నిర్ణయానికి రావాలని భావించాడట.
చంద్రబాబు నాయుడుకు కోడెల అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది.కాని పార్టీ కోసం సస్పెండ్ చేయాలనే అనుకున్నారట.
అదే విషయాన్ని కోడెల వద్ద కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు మాట్లాడాడని, పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడు తీసుకుంటామంటూ చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.పార్టీ నుండి సస్పెండ్ అయితే పరువు పోయినట్లయ్యిదనే ఉద్దేశ్యంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఈ విషయమై వైకాపా నాయకులు టీడీపీని టార్గెట్ చేస్తున్నారు.