పునరావాస కేంద్రాలు అప్పుడే పెట్టాల్సింది బాబు

వైకాపా నేత రోజా నేడు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న అనంతరం మీడియాతో ముచ్చటించారు.జగన్‌ పాలనతో రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉంది, నదులన్నీ కూడా జలకళతో పొంగి పొర్లుతున్నాయి.

 Ycp Party Leader Roja Comments On Jagan Mohan Reddy Rulling And Chandrababu Mis-TeluguStop.com

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు కూడా ప్రజా సంక్షమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు.వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తరహాలో జగనన్న కూడా రైతుబాంధవుడిగా పేరు తెచ్చుకోవడానికి చాలా శ్రమ పడుతున్నారు.

ప్రజలు కూడా అరాచకాలకు గురి కాకుండా చాలా ప్రశాంతంగా ఉన్నారు.చంద్రబాబు అనవసరంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

పునరావాస కేంద్రాలు ఇప్పుడు కాకుండా గతంలో యరపతినేని, కోడెల, బోండా ఉమ, దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు వంటి వారి చేతిలో బలైన ఎంతోమందికి ఏర్పాటు చేయాల్సి ఉండేది.నారాయణ కాలేజీలో చనిపోయిన అమ్మాయిల కుటుంబాలకు పెట్టాల్సి ఉండేదంటూ తెదేపా నేతలపై మండిపడ్డారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు.టీడీపీ పెయిడ్‌ ఆర్టిస్టులతో అనవసర రాద్దాంతం చేస్తోందని దుయ్యబట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube