కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ఇటీవలె చండీఘడ్లో ఓ కార్యక్రమంలో పాల్గోన్నారు.ఈ సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
యుద్ధం వద్దనుకుంటే మీరే లొంగిపోండి, పాక్ ఆక్రమిత కశ్మీర్ను మాకు అప్పగించండి అంటూ సూచించారు.కశ్మిర్ మూడింట ఒకవంతు ప్రాంతాన్ని 70 ఏళ్లుగా పాక్ తమ ఆధీనంలో ఉంచుకుంది, ఇది చాలా సీరియస్ విషయం అంటూ పాక్ తీరుపై మండిపడ్డారు.
పీఓకే ప్రజలు పాక్తో కలిసి ఉండాలనుకోవడం లేదని, వారు భారత్తో కలిసిపోవడానికే ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తోందని చెప్పుకొచ్చారు.ఏఓకే విషయంలో మాకు స్పష్టమైన వ్యూహాలు ఉన్నాయి.కాబట్టి యుద్ధం వద్దనుకుంటే ప్రశాంతంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్కు అప్పగించాల్సిందే అంటూ పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.