‘మన్మధుడు 2’ చిత్రంపై భారీ నమ్మకం పెట్టుకున్న నాగార్జున తీవ్రంగా నిరుత్సాహ పడ్డాడు.ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.
దర్శకుడు రాహుల్ రవీంద్రన్పై నాగార్జున పెట్టుకున్న నమ్మకం మరీ దారుణంగా వమ్ము అయ్యింది.ఇక మన్మధుడు 2 చిత్రం ఫలితం నేపథ్యంలో వెంటనే బంగార్రాజు చిత్రాన్ని నాగార్జున చేస్తాడంటూ ప్రచారం జరిగింది.
అందుకోసం దర్శకుడు కళ్యాణ్ కృష్ణ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేయడం జరిగింది.
ప్రస్తుతం జరుగుతున్న చర్చలను బట్టి చూస్తుంటే బంగార్రాజు చిత్రంకు మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఎందుకంటే బంగార్రాజు కంటే ముందు నాగార్జున కొత్త దర్శకుడితో ఒక చిత్రాన్ని చేయాలని నిర్ణయించుకున్నాడు.మహర్షి చిత్రం కథ చర్చలో కీలక పాత్ర పోషించిన రచయిత సోలోమన్కు నాగ్ ఛాన్స్ ఇవ్వబోతున్నాడు.
ఇప్పటికే కథను నాగార్జునకు చెప్పి ఒప్పించిన సోలోమన్ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్తో బిజీ అయ్యాడు.
నాగార్జున బంగార్రాజు చిత్రం కంటే ముందే ఈ కొత్త దర్శకుడితో సినిమా చేయడం కన్ఫర్మ్ అయ్యింది.బిగ్బాస్ 3 పూర్తి అయిన వెంటనే నాగార్జున ఈ చిత్రంను పట్టాలు ఎక్కించబోతున్నాడు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ చిత్రంను వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారు.
ఈ చిత్రంను మ్యాట్నీ మూవీస్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు.ఈ చిత్రంకు సంబంధించిన పూర్తి వివరాలు మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నాయి.