ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం అస్సలు ఇష్టం ఉన్నట్లుగా లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.ప్రశాంత వాతావరణంను చెడగొట్టేందుకు ఆయన ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అంటూ మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశాడు.
రాష్ట్రంలో పరిస్థితులు చాలా బాగున్నాయి.ఎలాంటి ఆందోళన అక్కర్లేదు.
కాని చంద్రబాబు నాయుడు ఇలా ఉండటం అస్సలు ఏమాత్రం ఇష్టం లేనట్లుగా అనిపిస్తుందని బొత్స అన్నారు.
ప్రశాంతతను తొలగించేందుకు చంద్రబాబు నాయుడు తనకు తెలిసిన గిమ్మిక్కులు చేస్తున్నాడు అంటూ మంత్రి ఆరోపించారు.
ఇకపై అయినా ఇలాంటి పిచ్చి వేశాలు మానేయాలంటూ బొత్స హెచ్చరించాడు.శాంతి భద్రతలను పరిరక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంటూ ఆయన ప్రశంసించాడు.
వంద రోజుల జగన్ పరిపాలన గురించి తెలుగు దేశం పార్టీ చేస్తున్న విమర్శలను కూడా బొత్స తిప్పి కొట్టాడు.ఈ వంద రోజుల్లో జగన్ ప్రభుత్వం సంక్షేమంకు పెద్ద పీట వేసినట్లుగా చెప్పుకొచ్చింది.