తెలుగు దేశం పార్టీ మాజీ ఎంపీ శివ ప్రసాద్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.శివ ప్రసాద్ స్వతహాగా నటుడు అవ్వడం వల్ల పార్లమెంటుకు వెళ్లి తన నిరసన తెలిపేందుకు అనేక రకాలుగా వేషాలను వేసుకున్నాడు.
ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంకు ఇవ్వాల్సిన నిధులను తెచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసేవాడు.రెండు సార్లు ఎంపీగా గెలుపొందిన శివ ప్రసాద్ ఇటీవలే వైకాపా రెడ్డప్ప చేతిలో ఓడిపోయాడు.
గత కొన్ని రోజులుగా శివ ప్రసాద్ గురించి మీడియాలో ఎలాంటి వార్తలు లేవు.కాని తాజాగా శివ ప్రసాద్ అనారోగ్యంతో బాధ పడుతున్నట్లుగా తెలుస్తోంది.
తీవ్రమైన వెన్ను నొప్పి కారణంగా ఆయన్ను హాస్పిటల్లో జాయిన్ చేయించారట.శివ ప్రసాద్ అనారోగ్య విషయం తెలిసిన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడాడు.
త్వరలో వచ్చి శివ ప్రసాద్ను కలుస్తానని కూడా చెప్పాడట.ఆయన ఆరోగ్యం విషయంలో శ్రద్ద చూపించాల్సిందిగా డాక్టర్లను కూడా చంద్రబాబు నాయుడు కోరడం జరిగింది.తన సొంత జిల్లా అవ్వడంతో పాటు కాలేజ్లో శివ ప్రసాద్ మరియు చంద్రబాబు నాయుడులు స్నేహితులు.వీరిద్దరు కూడా రాజకీయాల్లో కూడా స్నేహితులుగా కొనసాగారు.