యూకే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుని.తమ దేశానికి చదవు నిమిత్తం వచ్చే వారి సంఖ్య భారీగా తగ్గిపోవడంతో అనూహ్య నిర్ణయం తీసుకుని.
దాంతో భారత విద్యార్ధులకి ఈ నిర్ణయం భారీగా లబ్ది చేకూరేలా ఉందని తెలుస్తోంది.ప్రస్తుతం యూకే లో డిగ్రీ, మాస్టర్ డిగ్రీ చదువుకుంటున్న విద్యార్ధులకి లబ్ది చేకూరేలా చదువు అయిన తరువాత కూడా మరో రెండేళ్ళు ఉద్యోగ నిమ్మిత్తం ఉండేలా వర్క్ వీసాలో మార్పులు తీసుకువచ్చింది.
గతంలో అంటే 2012 కి ముందు ఇదే విధానం అమలులో ఉండేది కానీ కొన్ని బోగస్ యూనివర్సిటీలు అక్రమాలకి పాల్పడటంతో ఎంతో మంది విదేశీ విద్యార్ధులు భారీగా నష్ట పోయారు దాంతో అప్పటి హోం సెక్రటరీ గా ఉన్న ధెరిసా ఈ రెండేళ్ళ విధానాన్ని తొలగించారు.అయితే అప్పటి నుంచీ యూకే వస్తున్న విద్యార్ధుల సంఖ్య భారీగా తగ్గిపోయింది.ముఖ్యంగా భారత విద్యార్ధుల సంఖ్య సగానికంటే ఎక్కువగానే పడిపోవడంతో ఆ నిర్ణయాన్ని మార్పు చేయాలని.
గత కొన్నేళ్లుగా యూకే లో వర్సిటీలు అభ్యర్ధనలు చేస్తూ వచ్చాయి.దాంతో తాజాగా యూకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.మళ్ళీ పోస్ట్ స్టడీ వర్క్ వీసా విధానం అమలులోకి రావడంతో యూకే యూనివర్సిటీలతో పాటుగా ఎంతో మంది భారతీయ, విదేశీ విద్యార్ధులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు