ఏపీలో రివర్స్‌ ఎన్నికలు రావాలని కోరుకుంటున్నారు : బాబు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో నిర్మించేందుకు తాము ప్రయత్నిస్తే దాన్ని పురిటిలోనే చంపేశారు అంటూ చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో వైకాపాపై విమర్శలు గుప్పించాడు.వంద రోజుల్లోనే రాష్ట్రంను నాశనం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

 Chandrababu Naidu Comments On Jagan Mohan Reddy-TeluguStop.com

తెలుగు దేశం పార్టీ న్యాయ విభాగం ఆత్మీయ సదస్సులో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.ఈ సందర్బంగా జగన్‌పై పైవ్యాఖ్యలు చేశాడు.

గతంలో తెలుగు దేశం పార్టీ నాయకులపై మరియు నాపై ఏకంగా 565 కేసులు పెట్టారు.వాటన్నింటిని కూడా న్యాయ విభాగం సమర్ధంగా ఎదుర్కొందని చంద్రబాబు నాయుడు అభినందించాడు.

ఈ సమయంలోనే ఆయన మాట్లాడుతూ పోలవరంను రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఆలస్యం చేస్తున్నారు.ఇప్పుడు ఏపీ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు.ఏపీలో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా మళ్లీ ఎన్నికలు జరిగితే బాగుండు అంటూ చాలా మంది వైకాపాకు ఓట్లు వేసిన వారు కోరుకుంటున్నారు అంటూ చంద్రబాబు నాయుడు ఎద్దేవ చేశాడు.రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఎన్నికలు అయితే రాకపోవచ్చు కాని జమిలి ఎన్నికలు మరో మూడు సంవత్సరాల్లోనే వస్తాయంటూ చంద్రబాబు నాయుడు అన్నాడు.

అప్పుడు వైకాపాకు ప్రజలు బుద్ది చెప్పడం కన్ఫర్మ్‌ అన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube