ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో నిర్మించేందుకు తాము ప్రయత్నిస్తే దాన్ని పురిటిలోనే చంపేశారు అంటూ చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో వైకాపాపై విమర్శలు గుప్పించాడు.వంద రోజుల్లోనే రాష్ట్రంను నాశనం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
తెలుగు దేశం పార్టీ న్యాయ విభాగం ఆత్మీయ సదస్సులో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.ఈ సందర్బంగా జగన్పై పైవ్యాఖ్యలు చేశాడు.
గతంలో తెలుగు దేశం పార్టీ నాయకులపై మరియు నాపై ఏకంగా 565 కేసులు పెట్టారు.వాటన్నింటిని కూడా న్యాయ విభాగం సమర్ధంగా ఎదుర్కొందని చంద్రబాబు నాయుడు అభినందించాడు.
ఈ సమయంలోనే ఆయన మాట్లాడుతూ పోలవరంను రివర్స్ టెండరింగ్ ద్వారా ఆలస్యం చేస్తున్నారు.ఇప్పుడు ఏపీ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు.ఏపీలో రివర్స్ టెండరింగ్ ద్వారా మళ్లీ ఎన్నికలు జరిగితే బాగుండు అంటూ చాలా మంది వైకాపాకు ఓట్లు వేసిన వారు కోరుకుంటున్నారు అంటూ చంద్రబాబు నాయుడు ఎద్దేవ చేశాడు.రివర్స్ టెండరింగ్ ద్వారా ఎన్నికలు అయితే రాకపోవచ్చు కాని జమిలి ఎన్నికలు మరో మూడు సంవత్సరాల్లోనే వస్తాయంటూ చంద్రబాబు నాయుడు అన్నాడు.
అప్పుడు వైకాపాకు ప్రజలు బుద్ది చెప్పడం కన్ఫర్మ్ అన్నాడు.